హనుమకొండ:హస్తకళలను ప్రోత్సహించడం సమాజ బాధ్యతని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని తార గార్డెన్స్ లో గురువారం ఏర్పాటు చేసిన “చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ & హ్యాండిక్రాఫ్ట్ ప్రదర్శన మరియు అమ్మకం” స్టాళ్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా చేనేత కళాకారులను ప్రోత్సహించి, సంప్రదాయ హస్తకళలను ఆదరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రదర్శనలో ఉంచిన ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకున్నాయని, ప్రతి ఒక్కరూ సందర్శించి కొనుగోలు చేయాలని ఆయన కోరారు.
అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మా రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రాజమల్లా రెడ్డి, నాయకులు సింగారపు రవి ప్రసాద్, రఘుపాల్ రెడ్డి, పవన్ కుమార్ సహా చేనేత హస్తకళల నిర్వాహకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
