వీణవంక : వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఘన్ముకుల వెళ్తున్న దారిలో రోడ్డుపై నిలబడి ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థులను గమనించారు. కారును ఆపి పిల్లలతో మాట్లాడగా, బస్సు లేట్ అవుతుందంటూ వారు తెలిపారు. వెంటనే హుజురాబాద్ డీఎంతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే చొరవ ప్రదర్శించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
