హోలీ పండుగ సందర్భంగా జమ్మికుంట సీఐ వరంగంటి రవి స్థానికులతో, బిర్యానీ పాయింట్ వ్యాపారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. రాత్రి 10 గంటల వరకు బిర్యానీ పాయింట్లు మూసివేయాలని, హోలీ రోజున వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణించరాదని ఆయన స్పష్టం చేశారు. రోడ్లపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని, ప్రజలు హోలీ సంబరాలను ప్రశాంత వాతావరణంలో ఇంటివద్దనే జరుపుకోవాలని సూచించారు. వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
