
బిజిగిరి షరీఫ్ గ్రామంలో ఘనంగా ‘పోషణ్ పక్వాడ’ మరియు ‘గ్రాడ్యుయేషన్ డే’
జమ్మికుంట, ఏప్రిల్ 20 (zindagi9news) : జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో పోషణ్ పక్వాడ కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోషణ్ ర్యాలీతో పాటు గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తల్లులకు ప్రీస్కూల్ విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఐదు సంవత్సరాల లోపు పిల్లల మెదడు అభివృద్ధి 85 శాతం వరకు జరుగుతుందని, అందువల్ల ప్రతి చిన్నారిని తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లులను కోరారు. అలాగే పూర్వ పఠనం, పూర్వ లిఖితం, పూర్వ గణిత నైపుణ్యాల అభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాల పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచపల్లి వనజ, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, ప్రథమ్ ఎడ్యుకేషన్ ఎన్జీవో ప్రతినిధి నితీష్, తల్లులు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
