మాసబ్ ట్యాంక్ ఘటన – మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంటులో విషాదం
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంట్ లో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల బాలుడు అర్ణవ్ లిఫ్ట్లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించడంతో నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటనతో అపార్టుమెంట్ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
