బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ ఆదివారం
కరీంనగర్: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ ఆదివారం కరీంనగర్లో నిర్వహించనున్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సూచన మేరకు, ఈ సమావేశం వి కన్వెన్షన్ హాల్, కరీంనగర్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుంది.
ఈ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రతి గ్రామం నుండి ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని బిఆర్ఎస్ యూత్ నాయకుడు బండారి ప్రశాంత్ కోరారు. పార్టీ బలోపేతానికి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నిర్వహించనున్న ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
