పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి ను వీఆర్ చేయగా, ఆయన స్థానంలో పెద్దమందడి మండలంలో విధులు నిర్వహిస్తున్న యుగేందర్ రెడ్డి ని పెబ్బేరు ఎస్సైగా నియమించినట్టు ఎస్పీ రావుల గిరిధర్ ప్రకటించారు.
ఈ నియామకంతో పెబ్బేరు ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ మరింత బలోపేతం అవుతుందని పోలీస్ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన యుగేందర్ రెడ్డికి స్థానికులు, సహోద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
