పెబ్బేరు: పెబ్బేరు పోలీస్ స్టేషన్కు నూతనంగా విచ్చేసిన ఎస్సై యుగేందర్ రెడ్డిని బీజేపీ పట్టణ శాఖ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్సై యుగేందర్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అత్యంత అవసరం అని పేర్కొన్నారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుగా చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
