చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైరస్ క్రమంగా ఇండియాతో పాటు పలు దేశాల్లోనూ తన ఉనికిని చాటుకుంటోంది. హెచ్ఎంపీవీ భారత్లో ప్రవేశించడంతో మళ్లీ కరోనా నాటి పరిస్థితులు కనిపించేలా ఉన్నాయి. బెంగళూరులో ఇవాళ ఒక్కరోజే 3 హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కార్పొరేట్ కార్యాలయాలతో పాటు రద్దీ ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు మాస్కులు ధరించేలా యాజమాన్యాలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాయి. జనాల తాకిడి ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇకపై మాస్కులు ధరించాలని వైద్యులు సూచించారు.
