జమ్మికుంట పట్టణంలోని మొత్తం (30) వార్డులలో నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కొరకు జనవరి 21 – 22 వరకు వార్డు సభలు నిర్వహించుటకు గాను తెలంగాణ కమిషనర్ పౌర సరఫరాల శాఖా ఆదేశములు జారీ చేశారు.ఇట్టి ఆదేశముల మేరకు జనవరి 21 – 22 వరకు పట్టణములోని మొత్తం (30) వార్డులకు ప్రాంతాలను ఎంపిక చేసి, వార్డు సభలు నిర్వహించుటకు గాను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశములు జారీ చేశారని జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ అయాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అట్టి వివరములు ఈ ధిగువ తెలిపిన విధముగా కలవు.


