వైజాగ్: రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. బీఈ ఫైనల్ ఇయర్కు చెందిన విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీ, ఓ లెక్చరర్తో వాగ్వాదానికి దిగింది. ఉద్రిక్తత పెరిగిన సమయంలో ఆమె చెప్పుతో లెక్చరర్ను కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కాలేజీ యాజమాన్యం, విద్యార్థిని వెంకటలక్ష్మీని తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.
విద్యాసంస్థల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ తరహా చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఘటనపై పూర్తి విచారణ అనంతరం తుది చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
