
పెబ్బేరు లో ఘనంగా వాజ్పేయి జయంతి వేడుకలు
భారతీయ జనతా పార్టీ పెబ్బేరు శాఖ & రూరల్ ఆధ్వర్యంలో భారతరత్న, సీనియర్ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నేడు పెబ్బేరు సుభాష్ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాజ్పేయి చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలు, ప్రజాస్వామ్యానికి చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.వాజ్పేయి దేశాభివృద్ధికి చేసిన సేవలు ఎప్పటికీ స్మరణీయమని, ఆయన చూపిన మార్గంలో నడవడమే తమ లక్ష్యమని బీజేపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
