పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయులు కీలకం: ఎంఈఓ జయరాములు

పెబ్బేరు: పెబ్బేరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన పాఠశాల సముదాయ సమావేశం సందర్భంగా, మండలంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచిన ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ ఎస్. జయరాములు మాట్లాడుతూ – “ప్రతి పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకం. ఆయన చొరవ ఉంటే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది, విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఏ. విష్ణువర్ధన్ రావు, గుమ్మడం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నరసింహారావుతో పాటు పలువురు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పాఠశాలలు విద్యార్థులతో నిండాలంటే ఉపాధ్యాయుల కృషి అవసరమని, అందుకు మంచి నాయకత్వం అందించగలిగే ప్రధానోపాధ్యాయులు ముఖ్యమని అన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
