తెలంగాణలో త్వరలో భూకంపం రాబోతోందని EPIC ఎర్త్క్వేక్ సంస్థ అంచనా వేసింది. రాష్ట్రంలో రామగుండం సమీపంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావం వరంగల్, హైదరాబాద్ వరకు ఉంటుందని తమ సర్వేలో తేలిందిని పేర్కొంది. అటు ఏపీలోని అమరావతి వరకు ఈ భూకంప తీవ్రత ఉండొచ్చని అంచనా వేసింది. మహారాష్ట్ర వరకు దీని ప్రభావం ఉంటుందని స్పష్టం చేసింది. గతంలో భూకంపం వస్తుందని EPIC ఎర్త్క్వేక్ అంచనా వేయగా.. ఆ అంచనాలు కొన్నిసార్లు నిజమయ్యాయి.
