ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో ఈదురు గాలుల కారణంగా సుమారు 150 ఎకరాల మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఈ ఘటనను పరిశీలించిన తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ, రైతులకు ఎకరాకు రూ.50,000 నష్టపరిహారం అందజేయాలని, వ్యవసాయ అధికారులు తక్షణమే పరిశీలన చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతుండగా, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
