జమ్మికుంట: కొత్తపల్లి గ్రామానికి చెందిన తనుగుల తరుణ్ (22) మూడు రోజులుగా ఇంట్లో ఉన్నతరువాత, ఏప్రిల్ 9న ఉదయం 7:30 గంటలకు “హన్మకొండకి కాలేజీకి వెళ్తున్నాను” అంటూ ఇంటి నుండి బయలుదేరాడు. అప్పటి నుండి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో తండ్రి కిషన్ ఆందోళన చెందారు. స్నేహితులు, కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించగా తరుణ్ అక్కడికి రాలేదని తెలిపారు. ఈ మేరకు ఫిర్యాదు ఇవ్వగా, పోలీసులు మాన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
