జమ్మికుంట పట్టణానికి చెందిన వ్యాపారి అయితు అశోక్ , సమతా క్యాటరింగ్ వారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజున వీణవంక రోడ్డులోని తన ముల్కనూరు పాల డైరీ & రైస్ డిపో వద్ద దాదాపు 200 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు.
అన్నదానం చేయడానికి కారణం?
ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ,
🔹”మన కుటుంబంతో పాటు సమాజానికి కూడా సహాయపడాలి. అందుకే ప్రతి నెలా అన్నదానం నిర్వహిస్తున్నాను.”
🔹గత 15 నెలలుగా నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
ఇలాంటి సమాజహిత కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుందాం!
