తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో బుధవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, బస్తర్ ఫైటర్స్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపట్టాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఏడీజీ వివేకానంద సిన్హా పర్యవేక్షణలో ఆపరేషన్ కొనసాగుతుండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
