
కరీంనగర్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి దసరా కానుకగా ఇందిరమ్మ ఇండ్లు
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కీలక పాత్ర పోషించిన రాజేందర్ రావు..
అధికారులతో సమన్వయం చేసి ప్రొసీడింగ్స్ అందించే బాధ్యత వెలిచాలకు అప్పగింత..
ప్రత్యేకంగా వెలిచాలను
పిలిచి బాధ్యతల అప్పగించిన ముఖ్యమంత్రి ..
కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు బతుకమ్మ–దసరా పండుగ వేళ తీపికబురు అందింది. ఎన్నో ఏళ్లుగా సొంతింటి కల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా కానుకగా 4 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశారు. ఈ నిర్ణయంతో నియోజకవర్గం అంతటా పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు కీలకపాత్ర పోషించారు. ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలసి వెంటనే ఇండ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడంతో ఆయన సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందించే బాధ్యతను రాజేందర్ రావుకే అప్పగించారు.
శనివారం కొత్తపల్లి మండలం కమాన్పూర్, నాగులమల్యాల గ్రామాల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను రాజేందర్ రావు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
🔹కరీంనగర్ నియోజకవర్గం అతిపెద్దదని, దానికి అనుగుణంగా రెండో విడతలో అదనంగా మరో 4 వేల ఇండ్లు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరానని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
🔹ప్రతి అర్హుడైన పేద కుటుంబానికి ఇల్లు అందేలా కృషి చేస్తానని, నిర్మాణం వేగవంతం చేయడానికి దగ్గరుండి పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు.
🔹బిల్లులు వెంటవెంటనే చెల్లింపులు అయ్యేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించిందని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.
లబ్ధిదారులు తమ సొంతింటి కల నెరవేరుతున్నదంటూ హర్షాతిరేకం వ్యక్తం చేశారు. దసరా పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటామని తెలిపారు.
ఇదే సమయంలో మాజీ పాలక పార్టీ బీఆర్ఎస్పై రాజేందర్ రావు మండిపడ్డారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించినప్పటికీ ఒక్క ఇల్లు కూడా కట్టించలేకపోయారని, డబుల్ బెడ్రూమ్ పేరుతో పేదలను మోసం చేశారని విమర్శించారు. “కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇండ్లకు కేరాఫ్ అడ్రస్” అని రాజేందర్ రావు వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల స్వామి గౌడ్, నాయకులు బోనాల మురళి కృష్ణ, పెంట శేఖర్, నిమ్మల అంజయ్య, రుద్ర మనోహర్ సామి, పంజాల కృపాసాగర్, భూస సందీప్, బూస సంపత్, అరిగెల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
👉 ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు బతుకమ్మ–దసరా పండుగను రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు.
