
పెబ్బేరు పట్టణంలో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని, పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గౌని వేమారెడ్డి, పెబ్బేరు పట్టణ అధ్యక్షుడు క్రాంతి కుమార్, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్, మాజీ పట్టణ అధ్యక్షుడు కంచ ఆంజనేయులు, జిల్లా కౌన్సిల్ మెంబర్ రంగస్వామి గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా విద్యా సెల్ కన్వీనర్ నరసింహనాయుడు, పట్టణ ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, కార్యదర్శి మోతే రాఘవేంద్ర, ల్యాబ్ శివ, యువ నాయకుడు చింతకాయల రమేష్, రమేష్ రవితేజ, దగడ సాయి, రాకేష్ గౌడ్, శ్రీకాంత్, గిరి, గోవర్ధన్, కిట్టు, జగత్కరి నర్సొజీ, అరుణ్, మల్లేష్, రవితేజ, గంధం శివ తదితరులు పాల్గొన్నారు.
