పెబ్బేర్: గురువారం రాత్రి సుమారు 9:30 గంటల ప్రాంతంలో పెబ్బేర్ బైపాస్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న ఎర్టిగా కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో చటమోని ఎల్ల స్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
