తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ఖరారు చేసింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.
అభ్యర్థులు:
🔹 అద్దంకి దయాకర్ – టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
🔹 కేతావత్ శంకర్ నాయక్ – నల్గొండ డీసీసీ అధ్యక్షుడు
🔹 విజయశాంతి – పార్టీ సీనియర్ లీడర్
ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ సీటును సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్, మిగిలిన మూడు స్థానాల్లో పార్టీ నమ్మకస్థులకు అవకాశం కల్పించింది. అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు.
ఎన్నికల షెడ్యూల్:
📅 ఈనెల 20న ఎమ్మెల్సీ ఎన్నికలు
📅 అదేరోజు కౌంటింగ్, ఫలితాల వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే కోటాలో పోటీచేస్తున్న అభ్యర్థుల గెలుపు లాంఛనమేనని నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి నిబద్ధతగల నేతలకు న్యాయం చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నట్లు అధిష్టానం స్పష్టం చేసింది.
