CASO తనిఖీలు: 8 బైకులు, 2 ట్రాక్టర్లు స్వాధీనం

జమ్మికుంట, మే 20 (జిందగీ9న్యూస్): జమ్మికుంట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం విలాసాగర్, తనుగుల, గండ్రపల్లి గ్రామాల్లో CASO (Cordon and Search Operation) కార్యక్రమం నిర్వహించారు. ఈ తనిఖీల్లో హుజూరాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్, సైదాపూర్ ఎస్ఐ, ఎస్ఐ యూన్స్, ఎస్ఐ రవి పాల్గొన్నారు.
ఆపరేషన్లో భాగంగా వాహనాల పత్రాలను పరిశీలించగా, సరైన పత్రాలు లేని 8 మోటార్సైకిళ్లు మరియు 2 ఖాళీ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహన యజమానులపై నిబంధనల ప్రకారం జరిమానాలు విధించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలు వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.
