నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల దరఖాస్తులు

హైదరాబాద్: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 2025 జూలై 29 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా 654 నవోదయ విద్యాలయాలు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 పాఠశాలలు ఉన్నాయి. ప్రవేశానికి సంబంధించి ప్రవేశ పరీక్ష 2025 డిసెంబర్ 13న నిర్వహించనున్నారు.
ఒక్కో పాఠశాలలో సుమారు 80 సీట్లు ఉండగా, అందులో 75 శాతం సీట్లు గ్రామీణ విద్యార్థులకు కేటాయించారు. ఈ ప్రవేశ ప్రక్రియ పూర్తిగా ఉచితం.
దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్సైట్:
