
3 దశల్లో పంచాయతీ ఎన్నికలు – 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 350 కోట్ల రూపాయలు అవసరమని, తక్షణమే నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
