కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు( ఫిబ్రవరి 02 నుండి 10 వ తేదీ వరకు) నిర్వహణకు తనవంతుగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, కరీంనగర్ -అదిలాబాద్ నిజామాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి 15 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించారు… బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆలయ ఆవరణంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ప్రకటించారు.
