టేకుమట్ల జనవరి 30: టేకుమట్ల మండల కేంద్రంలో గురువారం రోజున రేణిగుంట శంకర్ మాదిగ, మచ్చ శ్రీకాంత్ మాదిగ నాయకులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంది అవార్డు గ్రహీత సినీ గేయ రచయిత మిట్టపెల్లి సురేందర్ హాజరై మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ కోసం లక్ష డబ్బులు వెయ్యి గొంతుల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమనికి ఫిబ్రవరి 7వ తారీకున హైదరాబాదులో జరగబోయే సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నాయకులు అందరూ దళిత బిడ్డలందరూ ఈ సభకు ప్రతి ఒక్కరు డప్పు చేత పట్టుకొని అధిక సంఖ్యలో ఈ సభను ప్రపంచం తిలకించేలా సర్కారు దిగివచ్చి వర్గీకరణను అమలు చేసే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు డాక్టర్ పుల్ల శ్రీనివాస్ , అల్వాల శ్రీనివాస్ పటేల్, మిట్టపల్లి మిత్రమండలి అధ్యక్షులు పుల్ల సతీష్ కుమార్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రేణిగుంట్ల శంకర్ మాదిగ,మండల ప్రధాన కార్యదర్శి ఇల్లందుల శంకర్ మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ మండల అధ్యక్షులు మత్స శ్రీకాంత్ మాదిగ, డప్పు సత్య, కుమ్మరి రాజేందర్, మిట్టపల్లి బాలు, వాసాల రవి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఎలికటి నరసయ్య మాదిగ, మచ్చ సారయ్య మాదిగ, కొలుగూరి సదానందం మాదిగ, మచ్చ సరోతం మాదిగ, అంబాల శంకర్ మాదిగ, కొలువురు శ్రీనివాస్ మాదిగ, పాలు శంకర్ మాదిగ, కొండ్ర సారయ్య మాదిగ, మచ్చ రాజేష్ మాదిగ, మచ్చ రామస్వామి మాదిగ, రేణికుంట్ల కళ్యాణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
