
మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి కి ఘన నివాళులు
హైదరాబాద్, ఆగస్టు 24 (జిందగీ 9 న్యూస్):
నల్గొండ మాజీ పార్లమెంట్ సభ్యులు, CPI జాతీయ నాయకులు దివంగత సురవరం సుధాకర్ రెడ్డి బౌతిక ఖాయానికి ప్రముఖ నేతలు ఘన నివాళులు అర్పించారు.
హైదరాబాద్ లోని CPI కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పాల్గొన్నారు.
వారు సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
