
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో సబ్–ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బత్తిని రంజిత్పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే, ఫిర్యాదుదారుడు మరియు అతని సోదరుడిపై మణుగూరు రక్షకభట నిలయంలో ఒక కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో వారిని అరెస్టు చేయకుండా నోటీసు జారీ చేసే విషయంలో అధికారిక సహాయం అందించేందుకు ఎస్ఐ బత్తిని రంజిత్ రూ.40,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, నిర్ధారక చర్యల అనంతరం ఎస్ఐపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
