భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఒక్కరోజులో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం రోజున దారుణ నష్టాల్లో ముగిశాయి.బీఎస్ఈ సెన్సెక్స్ 2,226 పాయింట్ల నష్టంతో 73,137 వద్ద ముగిసింది.నిఫ్టీ 742 పాయింట్ల నష్టంతో 22,161 వద్ద స్థిరపడింది.
ఈ భారీ పతనంతో మదుపరుల సంపదపై తీవ్ర ప్రభావం పడింది. ఒక్క రోజులోనే మార్కెట్ విలువలో సుమారు రూ.20 లక్షల కోట్ల మేర నష్టాన్ని మదుపర్లు ఎదుర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, మిడ్ & స్మాల్ క్యాప్ షేర్లలో బలహీనత వంటి అంశాలు ఈ పతనానికి దారితీశాయని నిపుణులు భావిస్తున్నారు.
