
జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉడుత తిరుపతి (49) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రతిరోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవలు చేసేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఆగస్టు 7 ఉదయం పనికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన తిరుపతి రాత్రి ఇంటికి రాలేదు. ఆగస్టు 8 తెల్లవారుజామున గ్రామస్తులు శ్రీరాములపల్లె రోడ్డుకట్ట వద్ద అతడు పడిఉన్నట్టు గుర్తించి సమాచారం ఇవ్వగా, అక్కడికి వెళ్లి చూసేసరికి తిరుపతి మృతిచెందినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
