పెద్దపల్లి: పరువు హత్య కలకలం రేపిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఎలిగేడు మండల పరిధిలోని ముప్పిరితోట గ్రామంలో సాయి కుమార్ అనే యువకుడిని దుండగులు గొడ్డలితో నరికి హత్య చేశారు.
ప్రేమ వ్యవహారమే కారణం?
స్థానికుల వివరాల ప్రకారం, సాయి కుమార్ ఓ యువతిని ప్రేమించడంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన కూతురిని ప్రేమించాడనే కారణంతో యువతి తండ్రి సాయికుమార్పై విచక్షణారహితంగా దాడి చేసి గొడ్డలితో పొడిచాడు.
పుట్టినరోజునే ప్రాణాలు తీసిన దారుణం
ఈ హత్య మరింత విషాదాన్ని మిగిల్చింది. తన జన్మదినానే దారుణ హత్యకు గురికావడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల చర్యలు
సాయికుమార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
– Zindagi9News
