
జమ్మికుంటలో మహిళ అనుమానాస్పద మృతి
జమ్మికుంట, సెప్టెంబర్ 17 (zindagi9news):
జమ్మికుంట పట్టణంలోని లెక్చరర్ కాలనీలో బుధవారం ఉదయం ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.
పోలీసుల వివరాల ప్రకారం, జమ్మికుంటకు చెందిన పోరండ్ల తిరుపతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ – తన కుమార్తె శ్రీదేవి (34 ఏళ్ల క్రితం దిడ్డి సుధాకర్కు వివాహమైంది) ఈ రోజు ఉదయం 6.40 గంటల సమయంలో మృతదేహంగా కనిపించిందని తెలిపింది. ఉదయం సుధాకర్ తన మరిది శ్రవణ్కుమార్కు ఫోన్ చేసి “మీ అక్క చనిపోయింది” అని చెప్పడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూసే సరికి శ్రీదేవి ఇంటి హాల్లోని సోఫాపై పడిపోయి మృతదేహంగా కనిపించింది.
మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మరణం అనారోగ్యంతో జరిగిందో లేక ఇతర కారణాలతో జరిగిందో స్పష్టత లేని కారణంగా కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసును అనుమానాస్పద మరణంగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
