
హన్మకొండ: జమ్మికుంట పట్టణం శాలవాడకు చెందిన పాల స్రవంతి (20) హన్మకొండలో పని చేస్తూ జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీనితో గురువారం రోజున స్వగ్రామానికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆటో ఎక్కుతుండగా కిందపడిపోయి తలకు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుండగానే ఆమె మృతి చెందింది. మృతురాలి మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
