నిరాహార దీక్ష విరమించిన సోనమ్ వాంగ్చుక్.. కేంద్ర హామీతో నిర్ణయం

న్యూఢిల్లీ, జూలై 24 (Zindagi9News): కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించిన నేపథ్యంలో పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ తన నిరవధిక నిరాహార దీక్షను విరమించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
దీక్షకు సంబంధించిన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే నిరాహార దీక్షను ముగించినట్లు ఆయన సతీమణి వెల్లడించినట్లు సమాచారం.
