ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం.. దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

హైదరాబాద్: బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి, ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న “ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం” దరఖాస్తుల స్వీకరణ గడువును 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1.19 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను 100 శాతం సబ్సిడీపై అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 2026 సెప్టెంబర్ 30లోగా TGOBMMS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
బీసీ మహిళలు ఇంటి నుంచే స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పించడం, కుటుంబ ఆదాయాన్ని పెంచడం, ఆర్థికంగా స్వావలంబన సాధించేలా చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం పేర్కొంది.
ఈ పథకానికి సంబంధించిన సమాచారం అర్హులైన ప్రతి మహిళకు చేరేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, అర్హులైన వారందరూ గడువులోగా దరఖాస్తు చేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
