రూ.80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అటవీ అధికారి

జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గులామ్ మొయినుద్దీన్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు.జూన్ 4న ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు నిర్వహించిన ట్రాప్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గులామ్ మొయినుద్దీన్ రూ.80 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. టేక్ చెట్ల నరికివేతకు అనుమతి, రవాణా పర్మిట్ జారీ చేయడంలో అధికారిక అనుకూలత చూపినందుకు ఫిర్యాదుదారుని నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.
మొదటగా రూ.2 లక్షలు లంచం కోరిన అధికారి, అందులో రూ.1 లక్షను మే 13న నగదు రూపంలో స్వీకరించినట్లు సమాచారం. అనంతరం ఫిర్యాదుదారుడి విజ్ఞప్తితో మిగిలిన మొత్తాన్ని రూ.80 వేలకు తగ్గించి, గురువారం ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అధికారి కూర్చున్న టేబుల్ డ్రాయర్ నుంచి రూ.80 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతడిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
