రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ATM విత్డ్రాల్ ఛార్జీలను పెంచేందుకు అనుమతినిచ్చింది. కొత్త నియమాల ప్రకారం:
- ఒకే బ్యాంకు ATMలో → నెలకు 5 ఉచిత లావాదేవీలు
- వేరే బ్యాంకు ATMలో
- మెట్రో నగరాల్లో: 5 ఉచిత లావాదేవీలు
- ఇతర ప్రాంతాల్లో: 3 ఉచిత లావాదేవీలు
ఈ పరిమితిని దాటితే → ఒక్కో విత్డ్రాల్పై రూ.23 ఛార్జ్ వసూలు చేయనున్నారు.
ఈ పెరిగిన ఛార్జీలు మే 1, 2025 నుండి అమల్లోకి రానున్నాయి.
ఖాతాదారులు తమ బ్యాంకింగ్ అవసరాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
