పట్టాదారు పాస్బుక్ కోసం రూ.20 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన GPO

కరీంనగర్, ఆగస్టు 20 (జిందగీ9న్యూస్): భూమి రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫీల్డ్ సర్వే రిపోర్టు సమర్పించి, పట్టాదారు పాస్బుక్ ఇప్పించేందుకు రూ.20 వేల లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలానికి చెందిన గ్రామ పాలన అధికారి (GPO) కాంపేటి శ్రీనివాస్ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఏసీబీ వివరాల ప్రకారం.. మోలంగూర్ గ్రామ GPOగా పనిచేస్తున్న శ్రీనివాస్ తొలుత రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. అనంతరం అదనంగా రూ.5 వేలు డిమాండ్ చేయడంతో మొత్తం రూ.20 వేలకు చేరింది. ఈ క్రమంలో ఫిర్యాదుదారు రూ.20 వేల లంచం అందజేస్తుండగా కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు ట్రాప్ నిర్వహించి పట్టుకున్నారు.
నిందితుడి వద్ద నుంచి రూ.20 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన చేతి వేళ్లు, ప్యాంటు వెనుక జేబుపై నిర్వహించిన రసాయన పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ తెలిపింది. అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందినట్లు పేర్కొంది.
నిందితుడిని అదుపులోకి తీసుకుని కరీంనగర్లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ACB టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
