
Zindagi9News కథనాలకు స్పందన – జమ్మికుంటలో ఫ్లెక్సీల తొలగింపు
ఫ్లైఓవర్తో పాటు గాంధీ చౌరస్తాలోనూ చర్యలు • మహాత్మా గాంధీ విగ్రహం మళ్లీ స్పష్టంగా దర్శనం
జమ్మికుంట, మార్చి 30 (Zindagi9News ప్రతినిధి):
జమ్మికుంట పట్టణంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై Zindagi9News ప్రచురించిన కథనాలకు మున్సిపల్ అధికారులు స్పందించారు. ఫ్లైఓవర్పై భద్రతకు ముప్పుగా మారిన ఫ్లెక్సీలను తొలగించిన అనంతరం, గాంధీ చౌరస్తాలో కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
పట్టణంలో ఉన్న గాంధీ చౌరస్తాలో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ల కారణంగా మహాత్మా గాంధీ విగ్రహం స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ అంశాన్ని Zindagi9News ఆధారాలతో వెలుగులోకి తీసుకురావడంతో, మున్సిపల్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చౌరస్తా పరిసరాల్లో ఉన్న ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించారు.
దీంతో ప్రస్తుతం గాంధీ చౌరస్తా పరిశుభ్రంగా మారి, మహాత్మా గాంధీ విగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో విజిబిలిటీ మెరుగుపడడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫ్లైఓవర్ మరియు గాంధీ చౌరస్తాలో ఒకేసారి చర్యలు చేపట్టడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో Zindagi9News పాత్ర ప్రశంసనీయం అని స్థానికులు అభిప్రాయపడ్డారు.
అధికారులు ఇకపై అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శుభ్రత, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
