
జాతీయ గీతం సమయంలో నిల్చోలేదని థియేటర్లో ఉద్రిక్తత
థియేటర్లో జాతీయ గీతం సమయంలో నిల్చోకపోవడంతో ఓ వ్యక్తిని తోటి ప్రేక్షకులు బయటకు పంపించిన ఘటన చోటు చేసుకుంది. ధురంధర్ సినిమా ప్రదర్శన సమయంలో జాతీయ గీతం వినిపించగా, ఆ వ్యక్తి నిల్చోలేదని ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలుత అతడు ఒప్పుకోకపోవడంతో థియేటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు ప్రేక్షకులు బలవంతంగా అతడిని బయటకు పంపారు. పెద్ద గొడవ జరగకుండా చూడాలనే ఉద్దేశంతో థియేటర్ సిబ్బంది అతడికి టికెట్ డబ్బులు తిరిగి చెల్లించారు. ఈ ఘటనతో కొద్దిసేపు థియేటర్లో గందరగోళం నెలకొంది.
