
గుండెపోటుతో పదవ తరగతి విద్యార్థిని మృతి
ఆంధ్రప్రదేశ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పదవ తరగతి చదువుతున్న సిరి అనే విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది.
పాఠశాల క్లాస్రూమ్లో పాఠాలు వింటున్న సమయంలో ఒక్కసారిగా సిరి కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
అకాల మరణంతో పాఠశాలలో విషాద వాతావరణం నెలకొనగా, విద్యార్థిని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
