
ఎన్కూర్, మే 21 (జిందగీ 9న్యూస్ రిపోర్టర్ – రాము నాయక్): ఏన్కూర్ మండలంలోని గార్ల ఒడ్డు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఘన స్వాగతం లభించింది. కార్యక్రమంలో ఏన్కూర్ సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, గాలిబ్, మునియతండా నాయకులు దేవుసింగ్, హేమ, రాందాస్, భాను, నరసింహ, లాలు, బాబులాల్, హరిప్రసాద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
