సైదాపూర్ (హుజురాబాద్):డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డిటిఎఫ్) సైదాపూర్ మండల శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు ఇటీవల ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కౌన్సిలర్లు బొంగానీ రమేశ్, వోడ్నాల రాంకిరణ్ వ్యవహరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఏరియర్స్ విడుదల చేయాలని, నూతన PRCను అమలులోకి తేవాలని, ట్రెజరీలలో పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం వారు నూతన డిటిఎఫ్ మండల కమిటీని ప్రకటించారు.
అధ్యక్షుడు: ఎం. సదాశివ్ (LFL HM, PS అమ్మనగుర్తి)
ఉపాధ్యక్షులు: టి. సత్యనారాయణ (SA (Gug), ZPHS ఎక్లాస్పూర్), పి. ప్రతిమ (SA (PD), ZPITS వెంకెపల్లి)
ప్రధాన కార్యదర్శి: బి. తిరుపతిరెడ్డి (SA (Math), ZPHS దుద్దెనపల్లి)
కార్యదర్శులు: కె. గిరిధర్ (SA (Bio), ZPHS వెంకెపల్లి), కె. వెంకటరమణ (SGT, PS గొల్లగూడెం)
ఆడిట్ కమిటీ కన్వీనర్: చే. భాగ్యలక్ష్మి (SA (Bio), దరిHS దుద్దెనపల్లి)
జిల్లా కౌన్సిలర్ సభ్యులు: బి. అజయ్ కుమార్ (SA, ZPHS దుద్దెనపల్లి), బొంగానీ రమేశ్ (SUT, PS రాయికల్), వాడ్నీల రాంకిరణ్ (SA (Phy.Sc), ZPHS వెంకెపల్లి), బుర్రు శ్రీనివాస్ (SGT, PS ఎక్లాస్పూర్)
సదాశివ్, తిరుపతిరెడ్డి లు అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికవడం పట్ల ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, డిటిఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
