వరంగల్ జిల్లా హసన్ పర్తి పెద్ద చెరువు మూల క్రాసింగ్ వద్ద ఆదివారం రోజున భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ టూవీలర్ను ఢీకొనడంతో దుర్గం పవన్, పౌతు మహేష్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హసన్ పర్తి నుండి సీతంపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో హనుమకొండ-కరీంనగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న హసన్ పర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
