
వైరా, జిందగీ 9న్యూస్: వైరాకు చెందిన డాక్టర్ మిట్టపల్లి ఐశ్వర్య నీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫలితాల్లో 21685వ ర్యాంకు సాధించి గర్వకారణంగా నిలిచింది.
మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఈ విజయాన్ని నమోదు చేసిన ఐశ్వర్య, వైరాకు చెందిన గోల్డ్ షాప్ వ్యాపారి మిట్టపల్లి నాగేశ్వరరావు, అనురాధ దంపతుల కుమార్తె. ఆమె నల్గొండ జిల్లా నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
ఈ విజయంపై పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, లగడపాటి ప్రభాకర్ రావు, ఉండ్రు శ్యాంబాబు, వనమా విశ్వేశ్వరరావు, మిట్టపల్లి నాగి, మిట్టపల్లి సత్యంబాబు, నూకల శ్రీనివాసరావు, నూకల ప్రసాద్ రావు, వై.బుచ్చిరామారావు, చెరుకూరి శ్రీనివాసరావు, గద్దె నీరజ, మాదినేని దుర్గాప్రసాద్, మాదినేని సునీత, రంగా సత్యనారాయణ, నంబూరు శ్రీనివాసరావు, షేక్ లాల్ అహ్మద్, రంగా వాసవి, మిట్టపల్లి మంజుల, రాయల అన్నపూర్ణ, మిట్టపల్లి మహాలక్ష్మి, మిట్టపల్లి సంధ్య, రాయపూడి వెంకటేష్, రాయపూడి రజిని, గజ్జల కృష్ణమూర్తి, పెనుగొండ ఉపేందర్ రావు, రాయపూడి నారాయణరావు, ముళ్లపాటి సీతారాములు, మిట్టపల్లి వెంకటరమణ, మిట్టపల్లి శివ, చింతోజు నాగేశ్వరరావు, నూకల అన్నపూర్ణ తదితరులు ఆమెను అభినందించారు.
డాక్టర్ ఐశ్వర్య సాధించిన ఈ విజయంతో వైరా పట్టణంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.
