చెడు వినవద్దు, చెడు చూడవద్దు,చెడు మాట్లాడవద్దు అనే దానికి తోడు చెడు పోస్టులు పెట్టవద్దు అని ఆ మూడు కోతులకు తోడుగా నాలుగో కోతి కూడా వచ్చేసింది.
ఈ విషయంలో అందర్నీ చైతన్యం చేయాల్సిన బాధ్యతను కొంత మంది తీసుకున్నారు.సోషల్ మీడియాను మంచికే వాడుదామని ఏపీ మొత్తం పోస్టులతో నింపేస్తున్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. సినీ తారాలతోనూ సందేశాలు ఇప్పిస్తున్నారు. ఈ పోస్టర్లు అన్నీ వైరల్ అవుతున్నాయి. నటీనటులు చెప్పే మాటలు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి.
సోషల్ మీడియాను మంచికి వాడుతున్న వారి సంఖ్య పది శాతం ఉంటుంది…మిగతా 90 శాతం అసత్య ప్రచారాలకు… దూషణలకు ..మోసాలకు వాడుకుంటున్నారు.
