
జమ్మికుంట: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వాసవి క్లబ్ VKSP జమ్మికుంట ఆధ్వర్యంలో స్థానిక శివాలయం (బొమ్మల గుడి) వద్ద భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గుండ రాజేంద్రప్రసాద్, కార్యదర్శి చందా సంతోష్, కోశాధికారి చిదురాల పూర్ణచందర్, వైస్ గవర్నర్ తంగళ్ళపల్లి రాజభాస్కర్, జోన్ చైర్పర్సన్ అయితు రమేష్, గో సేవ ఇంచార్జ్ రావికంటి నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.
