నల్గొండ, మార్చి 10: తెలంగాణలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ జిల్లా కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది. కేసులో రెండో నిందితుడు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా, మరో ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను ప్రకటించింది.
హత్యకు కారణమైన పరువు…
2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రణయ్ తన ప్రేయసి అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని సహించలేక ఆమె తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ ద్వారా ప్రణయ్ను హత్య చేయించాడు.
ముఖ్య నిందితుడు మారుతీరావు మృతి
కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా నిందితులైన సుభాష్ శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, ఎం.ఏ. కరీం, శ్రవణ్ కుమార్, శివపై నేరపూరిత కుట్ర, హత్యకు పాల్పడిన ఆరోపణలు నిరూపితమయ్యాయి.
ప్రణయ్ కుటుంబం స్పందన
కోర్టు తీర్పుపై ప్రణయ్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. “ఇది కేవలం మా కొడుకుకు మాత్రమే కాదు, కుల వివక్షకు బలైన ఎందరో ప్రేమికులకు న్యాయమైన తీర్పు” అని ప్రణయ్ తల్లి తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయే తీర్పు
కులం పేరుతో జరిగే హత్యలకు గట్టి హెచ్చరికగా ఈ తీర్పును న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. కోర్టు తీర్పుతో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ప్రజా సంఘాలు ప్రకటించాయి.
