
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం బోగంపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్న నెతజీ (24) అనే యువకుడు పెళ్లి కావడం లేదన్న మనస్తాపంతో డిసెంబర్ 30, 2025న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించిన వెంటనే నెతజీని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి రిఫర్ చేశారు.
అక్కడ చికిత్స పొందుతూ నెతజీ జనవరి 2, 2026న మృతి చెందినట్లు తండ్రి రత్న సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి..
